భార్య తలతో స్వచ్ఛందంగా లొంగిపోయిన భర్త

వివాహేతర సంబంధం కలిగి ఉన్న భార్యపై కక్షకట్టిన ఓ భర్త ఏకంగా ఆమె తలను వేరుచేసి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళిన సంఘటన చిక్కమగళూరు జిల్లా తరికెరెలో చోటు చేసుకుంది. అజ్జంపుర సమీపంలోని శివణి రైల్వే స్టేషన్ వద్ద భర్తసతీశ్, తన భార్య రూప(28) తలను నరికి బ్యాగులో వేసుకుని 20 కిలోమీటర్ల దూరంపాటు బైక్పై వెళ్ళి అజ్జంపుర పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. 9 ఏళ్లక్రితం ప్రేమించి రూపను సతీశ్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇరువురు పిల్లలు ఉన్నారు. అతడు బెంగళూరులో డ్రైవర్గా పనిచేసేవాడు. ఇటీవల కొన్నేళ్ళక్రితం అజ్జంపురలోని శివణి ప్రాంతానికి వెళ్ళి మాంసం దుకాణాన్ని ఏర్పాటు చేసుకుని భార్య పిల్లలతో కలసి ఉంటున్నాడు. భార్య రూప అదే గ్రామానికి చెందిన సునీల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరుచుకోవడంతో ఇరువురి మధ్య గొడవలు వచ్చాయి. పోలీసులు, స్థానికులు రాజీ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. రూప, సునీల్లు కలసి ఉండడాన్ని చూసిన సతీశ్ ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యాడు. కొడవలిని సునీల్పై విసరగా తప్పించుకుని పరారయ్యాడు. అక్కడే ఉన్న భార్య రూపపై దాడి చేసి తల, మొండెం వేరు చేసి అజ్జంపుర పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. రూ.3 లక్షలు అప్పు చేసి సునీల్కు ఇచ్చానని, అలాంటి వాడు ఇలా చేశాడని తాను విడుదలైన తర్వాత నయినా సునీల్ను హతమారుస్తానని సతీశ్ సవాల్ చేశాడు. పోలీసులు అతడిని కోర్టుకు హాజరుపరిచారు.
