Published: 18-08-2018
దుగ్గిరాల యార్డుకు నాబార్డు సహకారం

గుంటూరు: దేశంలోనే ఈ-నామ్ అమలులో అగ్రస్థానంలో నిలిచిన దుగ్గిరాల యార్డుకు తమ వంతు సహకారం అందించే విషయం పరిశీలించనున్నట్లు నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ కె.సురేష్కుమార్ తెలిపారు. స్థానిక పసుపు మార్కెట్ యార్డును నాబార్డ్ సీజీఎం శుక్రవారం సందర్శించారు. తొలుత ఈ-ట్రేడింగ్ విభాగాన్ని, పసుపు బిడ్డింగ్ విధానం, ఎసెస్సింగ్ ల్యాబ్లను పరిశీలిం చారు. అనంతరం సురేష్కుమార్ మాట్లాడు తూ, రైతులకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు లేదా వసతుల కల్పనకోసం తమ సహకారం అందించేందుకుగానూ యార్డులో వసతులను, యంత్రపరిజ్ఞానాన్ని పరిశీలించామన్నారు.
దుగ్గిరాల యార్డును పైలెట్ ప్రాజెక్టు కింద, మోడల్ మార్కెట్ యార్డుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మెరుగైన వసతుల కోసం రైతులకు ఎలాంటి అవస రాలు ఉంటాయనే అంశాన్ని యార్డు చైర్మన్ కేసంనేని శ్రీధర్, కార్యదర్శి వై.బ్రహ్మయ్యలతో చర్చించినట్లు చెప్పారు. ఆధునిక యంత్ర పరికరాలు అందించేందుకు సహకారం అందించాలని కోరారని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లిన అనంతరం తుది నిర్ణయం తెలియజేస్తామని తెలిపారు. సీజీఎం వెంట నాబార్డు గుంటూరు జిల్లా నాబార్డ్ డీడీఎం కార్తీక్, కృష్ణా జిల్లా డీడీఎం పి.విజయ్ తదితరులు ఉన్నారు.
