Published: 05-06-2018

డ్రైవర్ కాదు ....కనిపించే దేవుడు

చిత్తూరు జిల్లా :  ఫుల్లుగా మందుకొట్టి వెనకాతల ఉన్నవాల్లకోసం కొంచెమైనా పట్టించుకోని డ్రైవర్లు, వాహనాలు నడుపుతూ రోడ్డుప్రమాదాలు చేస్తూ అనేకమందిని భలి చేస్తున్న ఈ రోజుల్లో  తన ప్రాణం పోతుందని తెలిసి కూడా ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్ లో తన వెనక ఉన్న 50మంది ప్రాణాల గురించి ఆలోచించాడు.చివరికి గమ్యానికి చేర్చి ప్రాణాలొదిలాడు.  ఇక వివరాల్లోకి వెళితే                                                                                                            తమిళనాడు రాష్ట్రం పళ్లిపట్టుకు సమీపంలో ఉన్న కరింబేడు గ్రామానికి చెందిన అరుణాచలం 45 సంii 15 ఏళ్లుగా ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తిరుమల డిపోకు చెందిన తిరుమల-చెన్నై సర్వీసు డ్రైవర్‌గా చెన్నైకు వెళ్లిన అరుణాచలం సాయంత్రానికి అస్వస్థతకు గురయ్యాడు. చెన్నై నుంచి 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆయన మధ్యలో రెడ్‌హిల్స్‌లో బస్సు ఆపి మాత్రలు వేసుకున్నారు. ఇబ్బంది పడుతూనే రాత్రి పిచ్చాటూరుకు చేరుకున్న ఆయన ప్రయాణికులను దించేందుకు బస్సు ఆపారు. అప్పటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మరోసారి మందులు వేసుకొని కాసేపటికే గుండెపోటుతో స్టీరింగ్‌పై వాలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు.
గుండెనొప్పితో బాధపడుతూ కూడా జాగ్రత్తగా బస్సుని తీసుకొచ్చి బస్టాండ్ లో ఆపి తన సీట్లోనే కుప్పకూలాడి, విధి నిర్వహణలోనే ప్రాణాలు వదిలాడు. 
సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నఈ ఘటన  చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో ఆదివారం రాత్రి జరిగింది.