Published: 20-05-2018

జిల్లావ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ మేళా

గుంటూరు: ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జీఎం కేవీ చౌదరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేళాలో కొత్తకనెక్షన్‌ తీసుకున్న వారికి ఎంఎన్‌పీ వినియోగదారులకు సిమ్‌కార్డు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ఈ సిమ్‌కార్డును అన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవా కేంద్రాల్లో, ఫ్రాంచైజీల్లో, షోరూమ్స్‌లో ఉచితంగా పొందవచ్చునని తెలిపారు. ఈ అవకాశం ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.