Published: 28-07-2019
వివిధ కమిటీలు, ముఖ్యులతో జనసేనాని సమావేశాలు

పార్టీని బలోపేతం చేయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. అందులో భాగంగానే సోమవారం నుంచి సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీలోని వివిధ కమిటీలతోనూ, నాయకులతోనూ ఆయన సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించబోతున్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జరిగే ఈ సమావేశాలను మంగళగిరి, విజయవాడలోని పార్టీ కార్యాలయాల్లో నిర్వహించనున్నారు. పార్టీ బలోపేతంపై క్రీయాశీలక కార్యకర్తలు, ముఖ్యనేతలతో చర్చలు నిర్వహిస్తారు. 29న 11 గంటలకు ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు సాయంత్రం పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం విజయవాడ కార్యాలయంలో జరుగుతుంది. 30న 11 గంటలకు నరసాపురం, 4 గంటలకు కాకినాడ, 31న 11 గంటలకు రాజమహేంద్రవరం ఎంపీ నియోజకవర్గాల నేతలతో ఆయన భేటీ అవుతారు.
