Published: 20-07-2019
అన్నపూర్ణ స్టూడియోను ముట్టడించనున్న విద్యార్థులు

తెలుగు రియాలిటీ షో బిగ్బాస్ మూడో సీజన్ బిగ్బాస్ 3పై పలు ఆరోపణలు వచ్చాయి. ఈ రియాలిటీ షో ముసుగులో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని, సభ్యులను ఇబ్బందులు పెడుతున్నారంటూ, శ్వేతా రెడ్డి, గాయత్రి గుప్తా వంటి నటీమణులు కోర్టులో కేసులు కూడా వేశారు. అదే సమయంలో బిగ్బాస్ షోను రద్దు చేయాలని ఉస్మానియా విద్యార్థులు హెచ్చరించారు. అంతే కాకుండా మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే బిగ్బాస్ సీజన్ 3 ఆదివారం(జూలై 21) నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఉస్మానియా విద్యార్థులు బిగ్బాస్ షోను ఆపాలని చెప్పారు. లేకుంటే షో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న నాగార్జున అక్కినేనికి సంబంధించిన అన్నపూర్ణస్టూడియోను ముట్టడించాలని నిర్ణయించుకున్నారు. కందుల మధు ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థులు బయలుదేరారని సమాచారం.
