Published: 01-04-2019
ఏపీలో మళ్లీ తెలుగుదేశానిదే హవా

ఏపీలో మళ్లీ తెలుగుదేశానిదే అధికారమని ‘లోక్నీతి-సీఎ్సడీఎస్’ సర్వే స్పష్టం చేసింది. ఇప్పటిదాకా అనేక జాతీయ మీడియా సంస్థలు వైసీపీదే గెలుపు అని చెబుతుండగా... మొట్టమొదటిసారి ‘టీడీపీదే హవా’ అనే అంచనాలు వెలువడ్డాయి. ఏబీపీ చానల్ కోసం లోక్నీతి-సీఎ్సడీఎస్ ఈ సర్వే చేసినట్లు తెలిసింది. దీని ప్రకారం... ఆంధ్రప్రదేశ్లో మళ్లీ టీడీపీ బంపర్ మెజారిటీతో విజయం సాధించనుంది. టీడీపీ 126 నుంచి 135 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే అంచనా వేసింది. వైసీపీ 45 నుంచి 50 స్థానాలకు పరిమితమవుతుందని తేల్చింది. ఇక... 25 ఎంపీ సీట్లలో టీడీపీ 18 నుంచి 22 వరకు గెలుచుకుంటుందని, వైసీపీ 3 నుంచి 5 వరకు నెగ్గుతుందని లోక్నీతి-సీఎ్సడీఎస్ స్పష్టం చేసింది. జనసేన 2 నుంచి 5 వరకు అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించవచ్చునని తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్రంలో ఖాతా తెరిచే అవకాశం లేదని తేల్చింది. తెలుగుదేశం పార్టీకి 46.2 శాతం ఓట్లు లభిస్తాయని లోక్నీతి-సీఎ్సడీఎస్ అంచనా వేసింది. వైసీపీకి 37.2 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని తెలిపింది.
- అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన కొనసాగాలనే భావన.
- జగన్, పవన్లతో పోల్చితే చంద్రబాబు నాయకత్వంపైనే ఎక్కువ విశ్వాసం.
- రైతులకు సహాయం చేసే అన్నదాత సుఖీభవ, డ్వాక్రా మహిళలకు ‘పసుపు కుంకుమ’, రూ.5కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్, పింఛన్లు, చంద్రన్న బీమా, ఆటోలు, ట్రాక్టర్లపై జీవితకాల పన్ను ఎత్తివేత... మరిన్ని సంక్షేమ పథకాల ప్రభావం.
- పోలవరం నిర్మాణం, నదుల అనుసంధానం, రాజధాని అమరావతి నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, కియ వంటి కంపెనీల రాక, మౌలిక సదుపాయాల కల్పనలో చంద్రబాబు సామర్థ్యం!
...చంద్రబాబు పట్ల ఓటర్లు మొగ్గుచూపడానికి ఇవే కారణాలని సీఎ్సడీఎస్-లోక్నీతి తెలిపింది.
- జగన్పై మనీలాండరింగ్ నుంచి క్విడ్ప్రోకో వరకు అనేక కేసులు ఉన్నాయి. దీనివల్ల పాదయాత్ర ఫలితం కూడా లభించలేదు.
- చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత జరిగిన పరిణామాలు జగన్పై నమ్మకాన్ని మరింత తగ్గించాయి.
- రెండేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించడాన్ని ప్రజలు హర్షించడంలేదు.
