Published: 16-03-2019
"జగన్ను దెబ్బతీసేందుకే వివేకాను నరికి చంపారు

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని మానసికంగా దెబ్బతీసేందుకు ఆయన బాబాయ్ వివేకానందరెడ్డిని నరికి చంపారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. శనివారం రోజున ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై విజయసాయిరెడ్డి స్పందించారు. కడప జిల్లాలో అధికార పార్టీకి ఆయన హిమాలయ శిఖరంలా అడ్డునిల్చారన్నారు. భౌతికంగా అంతం చేస్తే తప్ప పట్టు దొరకదని.. ఇలా అమానవీయంగా హతమార్చారని పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్లే కుట్రకు బాధ్యులు అని అన్నారు.
" రాజారెడ్డి హంతకులు తెలుగుదేశంలో ఉన్నత హోదాల్లో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలు అలాగే ఉన్నాయి. హత్యాయత్నంలో వైఎస్ జగన్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సాఫ్ట్ టార్గెట్ వివేకానందను బలితీసుకున్నారు. రక్త దాహం తీరదా చంద్రబాబూ?" అని విజయసాయి తన ట్విట్టర్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.
