Published: 27-02-2019
డీజిల్ ధరల భారం పడుతున్నా..

డీజిల్ ధరల భారం పడుతున్నా.. ఆర్టీసీ బస్ టికెట్ ధరలు పెంచలేదని, ప్రయాణికుల సంక్షేమం దృష్ట్యా తామే భారాన్ని మోస్తున్నామని ఆ సంస్థ ఎండీ ఎన్.సురేంద్రబాబు వివరించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం ఆర్టీసీ డిపోను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి మాట్లాడారు. వాస్తవానికి ఆర్టీసీ నష్టాల్లో లేదని, డీజిల్, పెట్రోలు, మెటీరియల్ ధరలు పెరగడం వల్ల సంస్థపై పెనుభారం పడటంతో నష్టాలు భరించాల్సి వస్తోందన్నారు.
గ్యారేజీల్లో కార్మికులపై పనిభారం తగ్గించేలా అత్యాధునిక యంత్ర సామగ్రిని సమకూర్చుకునేందుకు టాటా, అశోక్ లైలాండ్, ఐషర్ వంటి సంస్థలు గ్యారేజ్ల్లో వెంటనే అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఈడీ నాగేశ్వరరావును, ఈడీఐ రామకృష్ణ, వెంకటేశ్వరరావులను ఆదేశించినట్లు తెలిపారు.
