ఇద్దరు కూతుళ్ళపై ఏడాదిగా తండ్రి అత్యాచారం
Published: Friday August 24, 2018

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు కూతుళ్ళపై ఏడాదిగా తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. నేపాల్ దేశం నుంచి వలసవచ్చిన రాజ్ బహదూర్ కుటుంబం శంషాబాద్లో నివాసముంటోంది. రాజ్ బహదూర్ ప్రస్తుతం హైమద్నగర్లోని ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కాగా... తమ ఇద్దరు కూతుళ్ళపై రాజ్ బహదూర్ ఏడాది కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్న విషయాన్ని తల్లి గమనించింది. అనంతరం ఎయిర్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
