సెంట్రల్ జైలుకు ప్రణయ్ హంతకులు
Published: Thursday November 01, 2018

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యకేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. రాష్ట్ర జైళ్ల శాఖ వరంగల్ రేంజ్ డీఐజీ ఎన్.మురళీబాబు, మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రణయ్ హత్య కేసులో ఉన్న ఆరుగురు నిందితుల్లో ముగ్గురు వ్యక్తులపై పీడీ యాక్ట్ నమోదు చేసి మిర్యాలగూడ నుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు పంపించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఏ1గా తిరునగరి మారుతీరావు, ఏ5గా ఎమ్డీ అబ్దుల్ ఖరీం, ఏ6 ఉన్న తిరునగరి శ్రవణ్ కుమార్లను బుధవారం వరంగల్ సెంట్రల్ జైలుకు తీసుకువచ్చారు. వీరు సంవత్సర కాలం పాటు పీడీ యాక్ట్లో ఇక్కడే శిక్ష అనుభవిస్తారని తెలిపారు. వరంగల్ సెంట్రల్ జైలులో ఈ ముగ్గురికి వేర్వేలు బ్యారక్లు కేటాయించామని డీఐజీ మురళీబాబు తెలిపారు.
