చార్ ధామ్ యాత్ర మొదలు ఈ రోజే తలుపులు తెరుచుకున్న కేదార్నాద్ ఆలయం
Published: Sunday April 29, 2018

డెహ్రాడూన్: సుదీర్ఘకాలం అనంతరం కేదార్నాథ్ ఆలయం తెరచుకుంది. నేడు ఉదయం భక్తులు సందర్శనార్థం ఆలయాన్ని తెరిచారు. సంవత్సరంలో ఈ ఆలయం గత ఆరు నెలలుగా మూసి ఉంచడం, ఆరు నెలలు తెరిచి ఉంచడం చేస్తారన్న విషయం విదితమే. చార్ధామ్ యాత్రలో భాగంగా కేదార్నాథ్ ఆలయాన్ని ఈ ఆరునెలల్లో లక్షల మంది సందర్శిస్తారు. భక్తుల తాకిడితో ఆ ప్రాంతం అంతా కోలహాలంగా ఉంటుంది. భక్తుల కోసం వైద్య, విద్యుత్, నీటి సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ పేర్కొన్నారు. మళ్లీ నవంబర్లో ఈ ఆలయాన్ని ముతవేయబడింది.
