కంట్లో నొప్పిగా ఉందని డాక్టర్ వద్దకు వెళ్తే..

Published: Friday February 22, 2019

విశాఖపట్నం: విశాఖలోని శంకర్ ఫౌండేషన్‌కు చెందిన వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. పెందుర్తికి చెందిన భారతి కొద్దిరోజుల క్రితం నుంచి కంటినొప్పితో బాధ పడుతుంది. నొప్పిని భరించలేక డాక్టర్ వద్దకు వెళ్తే పరీక్షలు జరిపి ఆమె కంటిలో 15 సెంటీమీటర్ల నులిపురుగు ఉందని వైద్యులు గుర్తించారు. శంకర్‌ఫౌండేషన్‌‌కు చెందిన డాక్టర్ భువన్ ఆమె కంట్లో పురుగు ఉన్నట్లు గుర్తించి మరో దైద్యురాలు అయిన నజిరిన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో భారతికి ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. తీరా స్కానింగ్‌ తీసే సమయంలో ఆ పురుగు కనిపించకుండా లోపలకు వెళ్లిపోవడంతో ఆపరేషన్‌ వాయిదా వేశారు. మరలా సిటీ స్కాన్ చేయించాలంటూ డాక్టర్ నజరిన్ తెలిపింది. ఆ నులిపురుగు ఎక్కడుందో కనిపెట్టిన డాక్టర్ నజరిన్ అప్పటికప్పుడు భారతికి ఆపరేషన్ చేసి దానిని తొలగించారు