జన్మభూమి ప్రతిజ్ఞా... అయితే ఏంటి.

Published: Thursday January 03, 2019
గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహి స్తున్నది. ఈ కార్యక్రమానికి సంబందించి ప్రభుత్వం పక్కాగా దిశానిర్ధేశం చేసింది. ప్రతి రోజు క్రమం తప్పకుండా పక్కాగా చేయాల్సిన వాటిలో జన్మభూమి ప్రతిజ్ఞ ఒకటి. ఈ ప్రతిజ్ఞ చేసే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా లేచి నిలబడి చేయి ముందుకు చాచి ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది. అధికారులతో పాటు సభలో ఉన్న వృద్ధులు, పెద్దలు, పిల్లలు అందరూ నిలబడి గౌరవించినా హోమియో వైద్యురాలు హసీనా మాత్రం తనకు సంబంధం లేదన్నట్లు, ఐ డోండ్‌ కేర్‌ అన్న రీతిలో సెల్‌ఫోన్‌లో ఆడుకుంటూ కూర్చుంది.
 
పాపం పక్కన ఉన్న వైద్య సిబ్బంది ఆమెకు చెప్పే ధైర్యం చేయలేక పోయారు. మండల పరిధిలోని కొండేపాడులో జరిగిన తొలిరోజు జన్మభూమి కార్యక్రమంలో వైధ్యాధికారి హసీనా ఈ విధంగా జన్మభూమి ప్రతిజ్ఞను విస్మరించి వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఎంపీడీవో పావులూరి బాలమ్మ, మండల ప్రత్యేకాధికారి రమేష్‌లు అసహనం వ్యక్తం చేశారు.