చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలు

Published: Thursday January 03, 2019

విజయవాడ: చెల్లని చెక్కు కేసులో ఓ మహిళకు ఏడా ది జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానా విధిస్తూ ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి టి.మల్లేశ్వరి బుధవారం తీర్పు చెప్పారు. పాయకాపురానికి చెందిన అల్లం థామస్‌రెడ్డికి కంకి పాడుకు చెందిన తామవరపు లక్ష్మి 2016 ఏప్రిల్‌లో రూ.5 లక్షల చెక్కు ఇచ్చింది. థామస్‌ రెడ్డి చెక్కును బ్యాంకులో వేయగా బౌన్స్‌ అయిం ది. బాధితుడు ఆగస్టు 29న న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. విచారణలో లక్ష్మిపై నేరారోపణ రుజువుకావడంతో న్యాయ మూర్తి పై విధంగా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితుడికి మూడు నెలల్లో రూ.5 లక్షలు చెల్లించని పక్షంలో మూడు నెలల సాధారణ జైలు శిక్ష విధించనున్నట్లు చెప్పారు.