అన్యాయం జరిగితే రాజీనామా చేస్తా
Published: Tuesday December 04, 2018

గోదావరి: నిడదవోలు మండలం కలవచర్లలోని పంట మురుగుకాలువ పూడ్చి సీఎన్జీ గ్యాస్ గొడౌన్ నిర్మాణానికి అధికారులు అనుమతించడంపై రైతుల ఆందోళనకు ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు బాసటగా నిలిచారు. గొడౌన్ నిర్మాణ పనులు ప్రారంభించడంతో కొద్ది రోజులుగా అధికారులకు రైతులకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్మాణ పనులు ప్రారంభించేందుకు పోలీసుల సహకారంతో అధికారులు కలవచర్ల చేరుకున్నారు.
దీంతో స్థానిక రైతులు మరోసారి పనులను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ ప్రాంతాని కి చేరుకుని మురుగు డ్రైనేజీపై గొడౌన్ నిర్మాణానికి ఎ లా అనుమతి ఎలా ఇచ్చారని అధికారులను నిలదీశా రు. రైతులకు వ్యతిరేకంగా అధికారులు చర్యలు తీసుకుంటే ఎ మ్మెల్యే పదవికి రాజీనామాచేసి పోరాడతానని అధికారు లను హెచ్చరించారు. ఎమ్మెల్యేతో చర్చించిన అనంతరం అధికారులు పనులు నిలిపివేసి వెనుదిరిగారు.
